► ధర పెంపుపై సుబాబుల్ రైతులకు హామీ ఇచ్చిన మంత్రి పుల్లారావు
► అమలుకు నోచుకోని వైనం
► ధర లేక అల్లాడుతున్న రైతులు
‘రాష్ట్ర వ్యవసాయ మంత్రి మన జిల్లా శాసనసభ్యులే..ఇంకేముంది ఈ ప్రాంతంలో పంటలకు అవసరమైన చేయూతనిచ్చి ఆక్సిజన్గా మారతారు..ప్రకృతి సహకరించినా, లేకున్నా..ఆయన కొండంత అండగా ఉంటార’ని రైతులు ఆశలు పెంచుకున్నారు. ఇందులో సుబాబుల్ రైతులకు మంత్రి హామీలిచ్చి వారి ఆశలకు మరింత ఆయుషు పోశారు. ఆరు నెలల కాలం గడిచింది..మంత్రి హామీల అమలు అటకెక్కింది..సుబాబుల్ ధర తగ్గింది.. రైతులకు మాత్రం కష్టాల కట్టె మిగిలింది.
చిలకలూరిపేటరూరల్ పేపర్ మిల్లులకు రైతులు సుబాబుల్, జామాయిల్ కర్రను తరలించే ఒప్పంద కాలపరిమితి ముగిసి ఆరు మాసాలైంది. నూతన ఒప్పందంలో భాగంగా గిట్టుబాటు ధరను అమలు చేయాలని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ గిట్టుబాటు ధర అమలు చేయటం కాదు ధరను పెంచుతామని స్వయంగా ప్రకటించారు. వీటితోపాటు కర్రను విక్రయించిన రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసేందుకు మార్కెట్ యార్డుల ద్వారా వేబ్రిడ్జిలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాలన్నీ మంత్రి గారు మర్చిపోయినట్లు ఉన్నారు. ధర పెంచడం అలా ఉంచితే కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించ లేదు. పేపర్ మిల్లులతో నూతన ఒప్పందమూ చేసుకోలేదు.
► జనవరి 19నన గుంటూరు జెడ్పీ భవన్లో పేపర్ కంపెనీలు, ఏఎంసీ చైర్మన్లు, కార్యదర్శులు, రైతులు, రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. మిల్లులకు కర్ర తరలింపు, గిట్టుబాటు ధరల పెంపు, ఆన్లైన్ చెల్లింపులు తదితర అంశాలపై మంత్రి హామీలు ఇచ్చారు. ఇందులో ఏ ఒక్కటీ నేటికీ అమలుకు నోచుకోలేదు.
► 2015 సెప్టెంబర్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సుబాబుల్ టన్నుకు రూ. 4,600 నుంచి రూ. 4,800 వరకు, జామాయిల్ రూ. 4,800పైన చెల్లిస్తామని ప్రకటించారు. ఇందుకు భిన్నంగా నేడు సుబాబుల్ గరిష్టంగా రూ. 4,600 ఉండగా కొనుగోళ్లు నిలచిపోయాయి. జామాయిల్ కర్రను కొనే నాథుడే లేకపోవటం విశేషం.
► మంత్రి నియోజకవర్గంలో సుబాబుల్ను నాదెండ్ల, తూబాడు, సాతులూరు, చందవరం, గణపవరం, కమ్మవారిపాలెం, మద్దిరాల, మాచర్ల నియోజకవర్గంలోని అడిగొప్పుల, దుర్గి ప్రాంతాల్లో సాగు చేస్తారు.
► చిలకలూరిపేట మార్కెట్ యార్డు ఆవరణలో వేబ్రిడ్జి ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఆన్లైన్ ద్వారా నగదు చెల్లింపులు చేస్తామని పేర్కొని ఆర్భాటంగా ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఒక్క టన్ను కర్రను సైతం కొనుగోలు చేయకపోవటం విశేషం.
► రైతులకే సుబాబుల్ విక్రయాలు గిట్టుబాటు లభించటం లేదని పేర్కొంటుంటే గత నెల రోజుల నుంచి కూలీలు సైతం తమకు గిట్టుబాటు కావటం లేదని కర్ర కోత ఆపేసి సమ్మె చేస్తున్నారు.
గుర్తింపు కార్డులు లేవు
గతంలో సుబాబుల్ పంటను పండించే రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసేవారు. నేడు కార్డుల మంజూరు ప్రక్రియను నిలిపివేశారు. కర్రను ఎనిమిది పేపర్ మిల్లులకు చెందిన ప్రతినిధులు గతంలో కొనుగోళ్లు చేశారు. నేడు కేవలం మూడు కంపెనీలకు చెందిన వారు మాత్రమే కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఈ విషయంపై దృష్టి సారించి సుబాబుల్కు గిట్టుబాటు ధరలు కల్పించి వేలాది మంది రైతులుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గిట్టుబాటు.. ఒట్టి మాట
Published Thu, Mar 24 2016 1:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement