* అధికోత్పత్తికి సహకరించండి
* వ్యవసాయాధికారులతో మంత్రి ప్రత్తిపాటి
* ప్రాథమిక రంగ మిషన్పై ముగిసిన సదస్సు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగ ప్రాధమ్యాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం ప్రకటించిన ప్రాధమిక మిషన్ను జయప్రదం చేయాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో రెండంకెల ప్రగతిని సాధించినప్పుడే ఈ మిషన్ లక్ష్యం నెరవేరినట్టన్నారు. ప్రాధమిక మిషన్ కార్యాచరణ ప్రణాళిక ఖరారుపై రెండు రోజులుగా ఇక్కడి ఇక్రిశాట్లో జరిగిన అధ్యయన గోష్టి బుధవారం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఇప్పటికీ నూటికి 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏయే రంగాలలో అధికోత్పత్తి సాధించడానికి అవకాశం ఉందో పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని వ్యవసాయాధికారులకు విజ్ఞప్తి చేశారు.
భూ సార పరీక్ష అవసరాన్ని రైతులకు వివరించడంతో పాటు సూక్ష్మనీటి పారుదల పద్ధతులను ఇతోధికంగా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పాడి, మత్స్య, ఉద్యానవన విభాగాల్లో అధికోత్పత్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, వరిలోనూ అధిక దిగుబడి వంగడాలను రైతులకు అందించాలన్నారు. మెట్టప్రాంతాల్లో వేసే స్వల్పకాలిక పంటలపై అవగాహన పెంచాలని, ఇక్రిశాట్ సేవలను వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. అధికోత్పత్తి, యంత్రపరికరాల వినియోగం, సూక్ష్మ నీటి పద్ధతుల అమలే ధ్యేయంగా అధికారులు పని చేయాలని సూచించారు. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో అనుసరించాల్సిన ప్రణాళికలను, విత్తనాలు, ఎరువుల అందుబాటును అధికారులు సమీక్షించారు. జిల్లాల వారీ ప్రణాళికలను ఖరారు చేశారు. ముగింపు సమావేశానికి హాజరైన వారిలో ప్రణాళిక సంఘం ప్రత్యేక కమిషనర్ ఎస్పీ టక్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్ కె.మధుసూదనరావు, వివిధ అనుబంధ రంగాల అధికారులు ఉన్నారు.
వ్యవసాయ కమిషనర్ పదవీ విరమణ నేడు
వ్యవసాయ కమిషనర్, డైరెక్టర్ కె.మధుసూదనరావు గురువారం పదవీ విరమణ చేయనున్నారు. 2013లో వ్యవసాయ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన మూడు సీజన్లను జయప్రదంగా నిర్వహించారు. ఉద్యానవన విభాగం డెరైక్టర్గా, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన మధుసూదనరావు 1988లో సివిల్ సర్వీసులో చేరారు.
'ప్రాథమిక మిషన్ సక్సెస్ బాధ్యత మీదే'
Published Wed, Apr 29 2015 7:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement