రెండు రాష్ట్రాలకూ ఒకే పీఏజీ | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలకూ ఒకే పీఏజీ

Published Wed, May 28 2014 5:49 AM

Principal Accountant General, Andhra Pradesh Only for two states

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం జూన్ రెండో తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పటికీ.. రెండు రాష్ట్రాలకూ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్  ఒక్కరే సేవలు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అకౌంటె ంట్ జనరల్(సామాన్య, సామాజిక రంగాల తనిఖీ), ఎపీ అకౌంటెంట్ జనరల్(ఆర్థిక, రెవెన్యూ రంగాల తనిఖీ) రెండు రాష్ట్రాలకూ హైదరాబాద్ నుంచే సేవలు అందిస్తారని ఈ మేరకు సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అనితా బాలకృష్ణ తెలిపారు. దీనిని ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంగా పరిగణిస్తారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement