తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: కేంద్ర కారాగారంలో ఖైదీలు కూరగాయలు, ఆకు కూరలు, నర్సరీ మొక్కలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రాంగణంలోని ఓపెన్ ఎయిర్ (ఆరుబయలు) జైలు ఉంది. దీనిలో సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను ఉంచుతారు. ప్రస్తుతం 45 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో కొంత మంది పెట్రోల్ బంకుల్లో పని చేస్తుండగా మిగిలిన ఖైదీలు వ్యవసాయం, డెయిరీ తదితర చోట్ల పని చేస్తున్నారు. సెంట్రల్ జైలు ఆవరణలో ఉన్న సుమారు 20 ఎకరాల్లో వంగ తోటలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీరు, కాకర, దొండ కాయలు, ఆకుకూరలు తదితర పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు మామిడితోటలు, పనస, కొబ్బరి చెట్లు, పండ్ల తోటలు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారు.
దీంతో ఇక్కడ నాణ్యమైన కూరగాయలు పండుతున్నాయి. వీటిని సెంట్రల్ జైలులోని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన కాయగూరలను స్థానికంగా అమ్మున్నట్టు జైలుæ సూపరింటెండెంట్ రాజారావు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కూరగాయలు, పండ్ల తోటల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం లభిస్తోందన్నారు. ఇక్కడ తయారు చేసిన సేంద్రియ ఎరువులు సైతం ప్యాకెట్ల ద్వారా అమ్మున్నారు. ఏటా మామిడి తోటపై సుమారు రూ.6 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది. జైలులో ఉన్న డెయిరీ ద్వారా ప్రతీ రోజు 200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. వీటిని జైలులో ఖైదీలకు ఉపయోగిస్తున్నారు. ఈ పాలతో పాటు గుడ్లనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలకు సరఫరా చేస్తున్నారు.
ఖైదీలే కర్షకులు
Published Fri, Jan 24 2020 12:47 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
- Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
- పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
- తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
- అబద్ధాల మోదీ
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
Advertisement