- ఖరీఫ్ వరికి తెగుళ్ల బెడద
- సాగు వ్యయం తడిసిమోపెడు
- బెంబేలెత్తుతున్న రైతులు
సాక్షి, విశాఖపట్నం : ఖరీఫ్లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా 8 వేల హెక్టార్లు. వ్యవసాయాధికారుల లెక్కలప్రకారం ఇప్పటి వరకు 75శాతానికి పైగా నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో నాట్లు వేసినా పంట చేతికొచ్చే సమయంలో లేనిపోని సమస్యలు తప్పవన్న ఆందోళనలో చాలా మంది రైతులున్నారు. వీరంతా ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. వారం రోజులుగా అడపా దడపా వర్షాలతో కొంత వరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇక ఇప్పటి వరకు పూర్తయిన నాట్లలో 50శాతానికి పైగా ఆలస్యంగా వేసినవే. అదనుకు ముందే చేలల్లో నీరు చేరి నిల్వ ఉండడంతో నాట్లు దెబ్బతినే అవకాశం ఉందని వారిలో ఒకింత ఆందోళన కనిపిస్తోంది. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వీటి ఉధృతి మరీ ఎక్కువుగా ఉన్నట్టు ఇప్పటికే వ్యవసాయ శాఖాధికారులు గుర్తిం చారు. ముఖ్యంగా 10-15 రోజుల మధ్యలో నాట్లు పడిన చోట చేలల్లో నీటి ఉధృతి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
వర్షాలు అనుకూలించినా..కలవరమే
సెప్టెంబర్లో 8170.4మిల్లీమీటర్లవర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..ఇప్పటి వరకు 2075.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డయింది. ఆరు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా, చింతపల్లిలో అసలు వర్షపాతమే నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెగుళ్లతో ఆందోళన
మరో పక్క ఆరంభంలోనే తెగుళ్ల బెడద మొదలైంది. ఇప్పటికే ఆకు ముడత.. అగ్గితెగులు విజృంభిస్తు న్నాయి. వీటితో పాటు వివిధ రకాల తెగుళ్లు జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలు అనే తేడా లేకుండా సుమారు 40శాతం పొలాలపై ఆశించడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెగుళ్లను సకాలంలో గుర్తించి నివారించకుంటే రైతులు పంటలు కోల్పోయే ప్రమాదం కూడాలేకపోలేదు. తెగుళ్ల నివారణ కోసం ఆరంభంలోనే చేతి చమురు వదలుతుండడంతో ఇక పంట చేతికొచ్చేసమయానికి సాగువ్యయం ఏమేరకు పెరుగుతుందో అనే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది.
ఇవీ నివారణ చర్యలు ..
ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు ప్రొఫినోఫాస్ ద్రావణాన్ని లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున ఎకరాకు 400 మిల్లీలీటర్ల మందును లేదా ఎస్ఫేట్, లేదా ఇమిడా క్లోఫిడ్ -7.8 ఎస్సీ ఫౌడర్ను లీటరు నీటికి 1.50 గ్రాముల చొప్పున ఎకరాకు 300 గ్రాముల కలిపి పిచికారీ చేయాలి. అయితే తరచూ ప్రొఫినోఫాస్, ఎసిఫేట్ మందును పిచికారీ చేయకూడదు. పొడతెగులు నివారణకు ఎక్సోకొనాజోల్ ద్రావణాన్ని, తీవ్రత ఎక్కువుగా ఉంటే వేలాడిమైసిన్ 3 శాతం మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి 2 మిల్లీలీటర్లుచొప్పున ఎకరాకు 400 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేయాలని వ్యవసాయశాఖాధికారులు సూచిస్తున్నారు.
వానవెంటే తెగుళ్లు
Published Tue, Sep 8 2015 11:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement