సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతు సాధికారత పేరుతో ప్రభుత్వం చేపట్టిన సదస్సులతో అన్నదాతలకు ఒనగూరిందేమీ లేదని తేలిపోయింది. రైతుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ప్రభుత్వం వారి వద్ద మంచి మార్కులు వేయించుకోవాలనే ఉద్దేశంతోనే ‘రైతు సాధికారత సదస్సు’ కార్యక్రమాన్ని రూపొందించింది. జిల్లాలో ఆరు రోజులుగా జరిగిన ఈ రైతు సాధికారత సదస్సుల కార్యక్రమం నిరసనలు.. నిలదీతలతో ముగిసిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ర్టప్రభుత్వం ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు రైతు సాధికారత సదస్సు లు నిర్వహించింది. ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీ పథకాన్ని అమలు చేశామని ప్రచారం చేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని సాక్షాత్తు టీడీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.
రుణమాఫీ పథకం పేరుతో రైతులను మాయ చేస్తున్నారని తేలిపోయింది. అందుకు మూడు విడతలుగా విడుదల చేసిన అర్హుల జాబితానే నిదర్శనం. ఆధార్ నంబర్లు లేవని జిల్లాలో వేలాదిమంది రైతులను అనర్హులుగా తేల్చారు. అదేవిధంగా వెబ్సైట్లో రుణమాఫీకి అర్హుడని చెబితే.. జాబితాలో అనర్హుడుగా చూపుతుండటంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మొత్తంగా చూస్తే చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన జాబితా వెనుక రైతులను మభ్యపెట్టే కుట్ర దాగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
5 లక్షల మందికిపైగా రైతులు బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్లకు పైగా రుణాలు పొందారని బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు జాబితా పంపితే.. ప్రభుత్వం రకరకాల కొర్రీలు పెట్టి వేలాది మందిని అనర్హులుగా తేల్చింది. అందులో మొదటి విడతలో 1.84 లక్షల మందిని తేల్చారు. వారు తీసుకున్న రూ.678 కోట్ల రుణాలకు 20 శాతం చొప్పున రూ.206 కోట్లు మాత్రం మాఫీ చేసినట్లు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 940 గ్రామాల్లో రైతు సాధికారత సదస్సులు నిర్వహించారు. మొత్తం 1,06,346 మంది రైతులు హాజరుకాగా, వీరిలో 59,786 మందికి మాత్రమే రుణవిముక్తి పత్రాలు అందజేశారు.
చివరి రోజూ
కొనసాగిన ఆందోళనలు
రైతు సాధికారత సదస్సులు ప్రారంభం నుంచి చివరిరోజు వరకు ఆందోళనల మధ్య సాగాయి. సదస్సుల వద్ద అధికారులను రైతులు నిలదీయడం, బ్యాంకుల వద్ద ఆందోళనలు కనిపించాయి. చివరి రోజైనా మంగళవారం మనుబోలు మండలం తహశీల్దార్ కార్యాలయానికి రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. అర్హులను అనర్హులుగా తేల్చటంపై మండిపడ్డారు. అదేవిధంగా మైపాడులో ఎంపీడీఓను మహిళలు నిలదీశారు.
అనంతసాగరం మండలం రేవూరులో జరిగిన సదస్సులో పాశం అప్పయ్య, వీరారెడ్డి, హరికృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి తదితరుల రైతుల పేర్లు లేవని అధికారులను నిలదీశారు. బాలాయపల్లి మండలం కొంబేడు గ్రామంలో సదస్సును అడ్డుకున్నారు. ఆధార్ కార్డులు పలుమార్లు ఇచ్చినా.. జాబితాలో పేర్లు లేకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ టీడీపీ మండల యువత అధ్యక్షుడు రాంబాబురెడ్డి సైతం తమ పార్టీ తీరుపై నిరసన తెలియజేశారు. నమ్మి ఓట్లేసినందుకు రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు.
కలువాయిలో నిర్వహించిన సదస్సును రైతులు అడ్డుకున్నారు. రెండవ జాబితా అంతా తప్పుల తడకగా ఉందంటూ మండిపడ్డారు. అధికారులు అడిగిన ఆధారాలన్నీ ఇచ్చినా.. జాబితాలో పేర్లు లేకపోవటంతో గ్రామానికి చెందిన రైతులు ఏ ఒక్కరూ రుణమాఫీ పత్రాలు తీసుకోలేదు. దీంతో సదస్సును వాయిదా వేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా చివరి రోజు ఆందోళనల మధ్య రైతు సాధికారత సదస్సు కార్యక్రమం ముగిసింది. ఆరు రోజుల పాటు జరిగిన సాధికారత సదస్సులకు రైతుల నుంచి స్పందన కరువైంది. అనేక చోట్ల అధికారులు మొక్కుబడిగా సదస్సులు నిర్వహించి ‘మమ’ అనిపించారు.
నిరసనలు.. నిలదీతలు
Published Wed, Dec 17 2014 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement