సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపును నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డిలో సీపీఎం కార్యాలయం నుంచి కొత్త బస్టాండు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.మల్లేశ్ డిమాండు చేశారు. సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఐటీ యూ నాయకులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రేవంత్కుమార్, సతీష్, పురుషోత్తం పాల్గొన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో సీఐటీయూ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత తహశీల్దార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పటాన్చెరులో బస్టాండు ఎదుట సీఐటీయూ నాయకులు నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జహీరాబాద్లో సీపీఎం నాయకులు గ్యాస్ధరను తగ్గించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాంచందర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్లో సీఐటీయూ నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాలో డివిజన్ నాయకులు కె.నర్సమ్మ, చిరంజీవి, సంగమేశ్వర్, మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో బస్టాండు ఎదురుగా సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. జోగిపేటలో డివిజన్ కార్యదర్శి మొగులయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్లో సీపీఎం నాయకులు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్సాపూర్లో సీపీఎం ఆధ్వర్యంలో బస్టాండు సమీపంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. వెల్దుర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గ్యాస్ ధర పెంపుపై భగ్గు
Published Thu, Jan 2 2014 11:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement