అతిథి మర్యాదలకు ప్రొటోకాల్ అధికారులు | Sakshi
Sakshi News home page

అతిథి మర్యాదలకు ప్రొటోకాల్ అధికారులు

Published Thu, Jun 25 2015 7:38 PM

అతిథి మర్యాదలకు ప్రొటోకాల్ అధికారులు - Sakshi

హైదరాబాద్: ఇతర దేశాల నుంచి వస్తున్న వీవీఐపీలు, సింగపూర్ ప్రతినిధుల అతిథి మర్యాదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎనిమిది అసిస్టెంట్ ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టుల్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త రాజధాని నిర్మాణం జరుగుతున్నందున సింగపూర్ ప్రతినిధులు తరచూ పర్యటనలు, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వారి అతిథి మర్యాదల కోసం మొత్తం 12 ఎస్కార్టు ఆఫీసర్ పోస్టులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఎనిమిది పోస్టులకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement