కాకినాడ క్రైం :జిల్లాలో 60వ విడత పల్స్ పోలియో నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. 2008లో చిట్టచివరి పోలియో కేసు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగలో నమోదు కావడంతో అక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జ్ కలెక్టర్తో లాంఛనంగా ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన బూత్లలో 19, 20 తేదీల్లో ఇంటిం టా పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే రాజమండ్రి నగర పరిధిలో అవాసా లు అధికంగా ఉండడంతో అక్కడ 21వ తేదీన కూడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 5, 30,884 మంది ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఇందుకుగాను 6.65 లక్షల డోసుల వ్యాక్సిన్ను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. పల్స్పోలియో నిర్వహణకు జిల్లాలో 3,250, విలీన మండలాల్లో 332 బూత్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి విలీన మండలాలకు 22 వేల డోసుల వ్యాక్సిన్ను సరఫరా చేశారు. 320 మంది సూపర్వైజర్ల ను పది రూట్లలో నియమించారు. రాజమండ్రికి టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న కుమార్, కాకినాడకు ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. పవన్ కుమార్, రామచంద్రపురానికి ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం డాక్టర్ మల్లిక్తో పాటు మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల డిప్యూటీ డీఎంహెచ్ఓలను ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా నియమించారు.
ప్రచార సామగ్రి పంపిణీ
పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు అవసరమైన ప్రచార సామగ్రి బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి చేరింది. దీంతో ఆ సామాగ్రిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులతో పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించే బూత్లకు తరలించే సన్నాహాల్లో డెమో సెక్షన్ అధికారులు నిమగ్నమయ్యారు. మత్స్యకార పల్లెలు, ఇటుక బట్టీలు, ఇతర సంచార జాతులు నివసించే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పూర్తిస్థాయిలో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డెమో ప్రసాదరాజు తెలిపారు. నూరు శాతం లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్రణాళికలు రచించామన్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి
ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడాన్ని తల్లిదండ్రులంతా బాధ్యతగా స్వీకరించాలి. అలాగే ఇరుగు పొరుగు పిల్లలకు కూడా చుక్కలు వేయించేలా విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం నుంచి పోలియోను పూర్తి స్థాయిలో తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సావిత్రమ్మ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. వ్యాక్సిన్, ప్రచార సామగ్రిని పీహెచ్సీలు, ఆరోగ్య కేంద్రాలకు చేరవేశాం. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైద్య సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
-డాక్టర్ అనిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
‘పల్స్ పోలియో’కు రంగం సిద్ధం
Published Thu, Jan 15 2015 2:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement