రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పుష్కర యూత్రికులు మృతి
ఇద్దరికి తీవ్రగాయూలు
తాడేపల్లిగూడెం : నిద్రమత్తులో కారు నడుపుతూ అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పుష్కర స్నానమాచరించి స్వస్థలాలకు వెళుతున్న వీరు మార్గమధ్యలోనే అనంత లోకాలకు వెళ్లిపోయూరు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులో కేఎస్ఎన్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో విజయవాడకు చెందిన పప్పు వీఎస్ఎస్కేహెచ్ ప్రసాద్ (36), ఎన్వీఎస్ ప్రసాద్ (30), పామర్తి పాపారావు (60) మృతి చెందగా, కారు నడుపుతున్న పామర్తి బాలాజీ (పాపారావు కుమారుడు), చేరి సృజన తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా విజయవాడ బెంజి సర్కిల్లో వొడాఫోన్ కంపెనీకి చెందిన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం కాల్ సెంటర్లో పనిచేస్తున్న 10 మంది ఉద్యోగులు పుష్కర స్నానాలు చేసేందుకు గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రెండు కార్లలో రాజమండ్రి బయలుదేరారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు కోటి లింగాల రేవులో పుష్కర స్నానాలు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తాడేపల్లిగూడెం ప్రాంతానికి వచ్చేసరికి కారు నడుపుతున్న పామర్తి బాలాజీ కునికిపాట్లు పడటంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి తాడిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు, ముందు సీట్లో ఎడమ వైపు కూర్చున్న మరొకరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితులను 108 అంబులెన్స్లో, మృతదేహాలను మరో అంబులెన్స్లో ఏరియూ ఆస్పత్రికి తరలించారు. శవపంచానామా అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
బోరుమన్న మిత్రులు..
రాజమండ్రి నుంచి 9.30 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరిన మరో ఐదుగురికి ప్రమాదం విషయం తెలియలేదు. విజయవాడ వెళుతున్న వీరు ఘటనాస్థలి వద్ద గుమిగూడిన జనాన్ని చూసి కారు ఆపారు. తమ స్నేహితులు మృత్యువాత పడ్డారని తెలుసుకుని బోరుమని విలపించారు. ప్రమాద వివరాలు బంధువులు, స్నేహితులు, కాల్ సెంటర్ నిర్వాహకులకు తెలిపారు.
ఉసురు తీసిన నిద్రమత్తు..
Published Sat, Jul 25 2015 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
‘‘అమేథీ నుంచి పోటీలో రాహుల్ బంట్రోతు’’
జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement