మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు | Sakshi
Sakshi News home page

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు

Published Sun, Jun 22 2014 9:54 AM

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండ మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీశైలం, అన్నవరం, విజయవాడ దేవస్థానాల్లో 5 వేల మందికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఫైల్పై మాణిక్యాలరావు తొలిగా సంతకం చేశారు.

 

మాణిక్యాలరావు మాట్లాడుతూ... దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. అందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి దేవాలయానికి సంబంధించిన ఆస్తులతోపాటు... దేవాలయాలకు అవుతున్న వ్యయాలను వెబ్సైట్లో పెడతామని పైడికొండల మాణిక్యాలరావు వివరించారు.

Advertisement
Advertisement