తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలలో ర్యాగింగ్! | Sakshi
Sakshi News home page

తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలలో ర్యాగింగ్!

Published Thu, Feb 6 2014 11:34 AM

తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలలో ర్యాగింగ్! - Sakshi

తిరుపతి : ఎన్ని చట్టాలు చేసినా.... నిబంధనలు కఠినతరం చేసినా ర్యాగింగ్ భూతానికి విద్యార్థులు బలి అవుతూనే ఉన్నారు. తాజాగా తిరుపతి అగ్రికల్చర్ యూనివర్శిటిలో ర్యాగింగ్ సంఘటన వెలుగుచూసింది. ర్యాగింగ్ పేరిట సీనియర్ల వేధింపులు ఓ విద్యార్థిని ప్రాణాలపైకి తెచ్చాయి. డిప్లమో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంకను కొద్ది రోజులుగా సీనియర్లు వేధిస్తున్నారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె హాస్టల్‌ రూమ్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారకస్థితిలో ఉన్న ప్రియాంకను గమనించిన ఆమె స్నేహితులు రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియాంక ఆసుపత్రిలో కోలుకుంటోంది. అయితే ఇంత జరిగినా యాజమాన్యం మాత్రం వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. బాధితురాలి తల్లిదండ్రులు కూడా వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.

Advertisement
Advertisement