పాకాల: పాకాల రైల్వే జంక్షన్లో గురువారం గుంతకల్ రైల్వే డివిజన్ అడిషనల్ రీజనల్ మేనేజన్ పీవీవీ సత్యనారాయణ విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తూ రైల్వే ఆదాయానికి గండి కొడుతున్న ప్రయాణికులను అదుపు చేసే దిశగా ఆయన చిత్తూరు, తిరుపతి, రేణిగుంట స్టేషన్ల నుంచి ప్రత్యేక తనిఖీ బృందాలను తీసుకువచ్చి ఆగిన రైళ్లలో టికెట్ తనిఖీలు చేపట్టారు. రాత్రి తొమ్మిదింటి వరకు ఆయన స్టేషన్ అంతటా తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ద్వారకనాథ్ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న ప్యాసెంజర్ల నుంచి రూ.51 వేలు జరిమానా వసూలు చేశారు.
రైలులో 40 శాతం మేరకు టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. పాకాల స్టేషన్ పరిధిలో రెండేళ్ల కిందట వచ్చే ఆదాయంతో పోలిస్తే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. స్టేషన్లో ప్రయాణికులకు వుంచినీటి సౌకర్యం బాగుందని, అయితే అక్కడక్కడా లీకేజీలు ఉన్నాయని, సరిదిద్దుకోవాలని స్టేషన్ మేనేజర్ జనార్ధన్రావుకు సూచించారు. అనంతరం స్థానికంగా ఉన్న రైల్వే టెన్నిస్ క్లబ్ను ఆయన సందర్శించారు. స్థానిక రైల్వే క్వార్టర్స్ పైకప్పు శిథిలావస్థకు చేరుకుందని, దాదాపు 50 గదులకు వురో ఏడాదిలో మరమ్మతులు చేయిస్తామన్నారు.
పాకాల జంక్షన్లో సౌకర్యాల స్థాయి పెంపునకు కృషి చేస్తామన్నారు. వురో 15 రోజుల్లో వుళ్లీ తాను ఇక్కడికి వస్తానని, టికెట్టు లేకుండా చేస్తున్న ప్రయాణాలను నివారించి రైల్వే ఆదాయన్ని పెపొందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో పాకాల స్టేషన్ మేనేజర్ జనార్దన్రావు, సూపర్వైజర్లు జయదేవ్, శ్రీహరిరావు, టెలికం జేఈలు ఆనందకుమార్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే అధికారుల విస్తృత తనిఖీలు
Published Fri, Aug 1 2014 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement