ట్రాక్టర్, బైక్ ఢీ.. స్టేషన్ మాస్టర్ మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీ.. స్టేషన్ మాస్టర్ మృతి

Published Wed, Feb 18 2015 9:35 AM

Railway station master died in tractor and bike accident

కొడవలూరు : ట్రాక్టర్ - బైక్ ఢీకొని రైల్వేస్టేషన్ మాస్టర్ మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో బుధవారం జరిగింది. వివరాలు.. నెల్లూరుకు చెందిన మునిస్వామి(50) తలమంచిలో రైల్వేస్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఆయన డ్యూటీకి బైక్‌పై వెళ్తుండగా కొడవలూరు రైల్వే గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement