ఈశాన్యం రాకలో జాప్యం | Sakshi
Sakshi News home page

ఈశాన్యం రాకలో జాప్యం

Published Thu, Oct 2 2014 1:45 AM

rains forecast to telangana, andhra pradesh

ఒకటి రెండుచోట్ల జల్లులుపడే అవకాశం

 సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాల రాకలో కాస్త జాప్యం నెలకొనే అవకాశాలున్నాయి. వాస్తవంగా ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ నెల ప్రారంభంలోనే ప్రవేశించాలి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వాయవ్య భారత్ నుంచి నిష్ర్కమిస్తున్నాయి. జమ్మూ, బరేలి, కాన్పూర్, ఉజ్జయిని, పోర్‌బందర్ ప్రాంతాల్లో ఇంకా నైరుతి ప్రభావం కొనసాగుతోంది. ఇవి పూర్తిగా నిష్ర్కమించాకే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువ ఎత్తున తూర్పు, ఈశాన్య గాలులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోను ఒకటి రెండు చోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
 

Advertisement
Advertisement