రాగల 24 గంటల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు! | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు!

Published Sat, Apr 18 2015 2:22 PM

Rains in AP and Telangana with in 24 hours, says visakhapatnam meteorological department

విశాఖపట్నం : పశ్చిమ బంగాళాఖాతం నుంచి ఒడిశా మీదగా కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు సాయంత్రానికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమల్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement