సైదాపురం: జిల్లాలో మూడేళ్లుగా నెలకొన్న కరువు రక్కసి రైతన్నలను కబళిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు లేక పొలాలన్నీ బీడుగా మారాయి. సేద్యం తప్ప మరో పని తెలియని అన్నదాతలు ఏరోజుకారోజు వర్షం కురుస్తుందని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. చెరువులన్నీ చుక్కనీరు లేక ఒట్టిపోయాయి. బోర్ల కిందైనా పంటలు సాగు చేద్దామని సాహసం చేసిన రైతులు చివరికి తీవ్రంగా నష్టపోయారు.
ఆత్మహత్య చేస్తున్న చాగణం గ్రామానికి చెందిన రైతు మోడిబోయిన కృష్ణయ్య అప్పులుజేసి రెండేళ్లలో తన మూడెకరాల పొలంలో 20 బోర్లు వేసినా గంగ జాడ కన్పించలేదు. ట్యాంక్లతో కూడా తాను సాగు చేసిన మిరప పొలానికి నీరు పెట్టారు. రెండు రోజుల కిందట కూడా చివరి ప్రయత్నంగా మరో బోరు వేసినా ఫలితం లేకుండా పోయింది. విసిగిపోయిన కృష్ణయ్య చేసేది లేక మిన్నకుండిపోలేదు. బోర్లు వేసేందుకు చేసిన లక్షలాది రూపాయలు అప్పులు తీర్చే దారి లేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
భోగి పండగ రోజు కుటుంబసభ్యులందరినీ ఇంటికి పిలిచి అందరితో ఆనందంగా మాట్లాడారు. మిరపతోటకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడే తనువు చాలించారు. కృష్ణయ్యకు భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహం చేశారు. అద్దె ఇంట్లోనే ఆయన కుటుంబం జీవిస్తుంది. పండగకు ఇద్దరు కుమార్తెలతో పాటు అల్లుళ్లను కూడా పిలుచుకున్నారు. కుమారుడు బెంగళూరులో చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.ఆయన కూడా పండగకి ఇంటికి చేరుకున్నారు.
కుటుంసభ్యులు, గ్రామస్తులంతా కృష్ణయ్య మృతదేహం వద్ద బోరున విలపించారు. తమకు దిక్కెవరయ్యా అంటూ భార్య రాజమ్మ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. బాడుగ ఇంట్లో కాపురం ఉండటంతో మృతదేహంను అక్కడ కాకుండా సొంత తమ్ముడి ఇంట్లో ఉంచాల్సి వచ్చింది. పండగ పూట ఆ కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్రమైన విషాదఛాయలు అలముకున్నాయి.
రైతన్నను కబళించిన కరువు
Published Thu, Jan 15 2015 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement