ఏలూరు, న్యూస్లైన్:ఢిల్లీలో సమైక్య నినాదాన్ని హోరెత్తించేందుకు జిల్లాకు చెందిన ఎన్జీవోలు, వైసీపీ నాయకులు, కార్యక ర్తలు శనివారం సాయంత్రం ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో బయలుదేరారు. ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే మహాధర్నాలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి సుమారు 1,500 మంది ఎన్జీవోలు తరలివెళ్లారు. ఏలూరు పెద్దరైల్వే స్టేషన్ నుంచి సుమారు 800 మంది ‘సమైక్యాంధ్ర ఎన్జీవో ప్రత్యేక రైలు’ ఎక్కారు. ఈ రైలుకు ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ కార్యదర్శి టి.యోగానందం, నాయకులు హరనాథ్, చోడగిరి శ్రీనివాస్ జెండా ఊపి ైరె లును పంపారు. ప్రత్యేక రైలు సౌకర్యంలేని ప్రాంతాల నుంచి, ఆకివీడు, దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల నుంచి ఎన్జీవోలు పెద్ద స్టేషన్కు తరలివచ్చారు.
ఇదిలావుండగా నరసాపురం ఎక్స్ప్రెస్లో శనివారం రాత్రి 50 మంది ఎన్జీవోలు ఢిల్లీకి పయనమయ్యారు. పాలకొల్లు నుంచి 50 మంది, తణుకు నుంచి 80 మంది, తాడేపల్లిగూడెం నుంచి 70 మంది బయల్దేరి వెళ్లారు. భీమవరం, నిడదవోలు, ఉండి ప్రాంతాల నుంచి కూడా ఎన్జీవోలు హస్తినబాట పట్టారు. చింతలపూడి, పోలవరం ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ఎన్జీవోలు ఢిల్లీ వెళ్లారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం శనివారం 200వ రోజుకు చేరుకుంది. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జూలై 30న చేపట్టిన నిరసన దీక్షలు 200 రోజుకు చేరారుు. దీక్ష 200 రోజుకు చేరిన సందర్భంగా గాంధీబొమ్మల సెంటర్లో జేఏసీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ కేఎస్పీఎన్ వర్మ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
వెల్లువలా వెళ్లిన వైసీపీ కార్యకర్తలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు నగరం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు రాజమండ్రి నుంచి వచ్చిన ప్రత్యేక రైలులో కార్యకర్తలు ఉత్సాహంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు వెళ్లారు. పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యవేక్షణలో నాయకులు పాము శామ్యూల్, కోలపల్లి ఉమాశంకర్, కర్రి శ్రీనులతో పాటు సుమారు 60 మంది కార్యకర్తలు ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరికి పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు వీడ్కోలు పలికారు.
ఆహార, పానీయాలు అందించిన తోట
ఢిల్లీ వెళుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆహార పానీయాలను ఏలూరు రైల్వే స్టేషన్లో అందజేశారు. విభజన బిల్లును పార్లమెంటులో కూడా అన్ని పార్టీలూ తిరస్కరించాలని కోరుతూ వైసీపీ తలపెట్టిన ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళుతున్న కార్యకర్తలను తోట చంద్రశేఖర్ అభినందించారు. దెందులూరు సమన్వయకర్త సీహెచ్ అశోక్గౌడ్, కైకలూరు సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షులు జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హస్తిన బాట
Published Sun, Feb 16 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement