మహబూబ్నగర్ కల్చరల్, న్యూస్లైన్: మన పూర్వీకులు చేపట్టిన ప్రతి అంశంలో ఓ అర్థం, పరమార్థం దాగి ఉందని, రంగవల్లులు తీర్చిదిద్దడంలో కూడా శాస్త్రీయ పరిజ్ఞానం ఇమిడి ఉందని నేహషైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకాంత్ పేర్కొన్నారు. ‘సాక్షి’, నేహషైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.
ఈ పోటీల్లో వయోబేధం లేకుండా మహిళలు, విద్యార్థినులతో పాటు ఓ మైనార్టీ మహిళ, పురుషుడు కూడా పాల్గొని, రంగవల్లులను తీర్చిదిద్దారు. వివిధ ఆకృతులు, పలు ఆకర్షణీయ రంగులతో రకరకాల ధాన్యాలు, కలశాలు, గొబ్బెమ్మలను అలంకరించారు. దేశభక్తి, సామాజిక అంశాలను జోడించిన సందేశాలను ముగ్గులతో పాటు ప్రదర్శించి జాతి సమైక్యత, ప్రజాహిత కార్యక్రమాలపై వారికున్న మమకారాన్ని చాటుకున్నారు.
96 మంది పాల్గొన్న ఈ పోటీ జిల్లా పరిషత్ మైదానానికి సంక్రాంతి శోభను చేకూర్చాయి. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ విజయ్కాంత్ మాట్లాడుతూ ముగ్గుల్లో గణితం, సైన్స్, భౌగోళిక అనుసంధానం, దేశసంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. కుడి, ఎడమల సమాన దూరాన్ని, ప్రాముఖ్యతను పాటించే ముగ్గులు సమానత్వాన్ని సూచిస్తాయని, పసుపు, కుంకుమ ఆధ్యాత్మికతను వెల్లడిస్తాయన్నారు. సు న్నం, క్రిమికీటకాలను ఇళ్లలోకి రాకుండా కాపాడి ఆరోగ్యాన్ని పదిలపరుస్తాయని చెప్పారు.
అన్ని రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయని వివరించారు. జేపీఎన్ విద్యాసంస్థల అధిపతి కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు క్రమశిక్షణను, పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. సాక్షి యాజమాన్యం సంక్రాంతి సంబరాలను ముగ్గుల పోటీ రూపంలో చేపట్టడం అభినందనీయం ప్రశంసించారు. కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ మాట్లాడుతూ ముగ్గులు, సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. ‘సాక్షి’ యూనిట్ ఎడిషన్ ఇన్చార్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొలికిరణంతో పాటు తలుపులు తట్టే సాక్షి పత్రిక వార్తలనే కాకుండా సామాజిక అంశాలను సృజిస్తుందన్నారు. ‘సాక్షి’ని పాఠకులు తమ కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నారని అన్నారు.
అనంతరం విజేతలతోపాటు పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులను అందజేశారు. అంతకుముందు ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం’ అంటూ నిహారిక, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అంటు అనూష చేసిన నృత్యాలు, చంద్రముఖి కల్చరల్ అకాడమీ డెరైక్టర్ చంద్రశేఖర్, వాసవీ క్లబ్ ప్రతినిధి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యానాలు అలరించాయి. న్యాయనిర్ణేతలుగా కవిత, రాగసుధ, మంజులత వ్యవహరించారు. డీఆర్ఓ సతీమణి రాణి, సాక్షి బ్రాంచ్ మేనేజర్ తిరుపతిరెడ్డి, బ్యూరో ఇన్చార్జి రాజగోపాల్, సాక్షి టీవీ కరస్పాండెంట్ సుభాష్చంద్రబోస్, యాడ్స్, సర్క్యూలేషన్ మేనేజర్లు వెంకటేశ్, రవిశంకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే...
ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి ఎన్.శ్రీలక్ష్మి(మహబూబ్నగర్), ద్వితీయ బహుమతి ఎస్.కరుణ(నారాయణపేట), తృతీ య బహుమతి కవిత(కొత్తకోట), ప్రోత్సాహక బహుమతులు జి.రమాదేవి(వనపర్తి), శుభాంగి, జ్యోత్స్న, సీహెచ్ నందిని (మహబూబ్నగర్), స్వప్న(షాద్నగర్) ఎంపికయ్యారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక బహుమతులు అందజేశారు.
రంగవల్లుల్లో శాస్త్రీయత: విజయ్కాంత్
Published Sun, Jan 12 2014 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement