కదిరి(అనంతపురం): పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లాలోని కదిరికి చెందిన పదో తరగతి విద్యార్థినిని స్థానికంగా నివాసముంటున్న ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి పరీక్షలు రాయడానికి వచ్చిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడు.
ఈ అంశంపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.