విషజ్వరాలతో వణుకుతున్న గ్రామం.. ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

విషజ్వరాలతో వణుకుతున్న గ్రామం.. ఒకరి మృతి

Published Wed, Jul 29 2015 7:47 AM

rattamma died with viral fever

సిరివెల్ల: కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం వీరారెడ్డి పల్లె వాసులను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. గ్రామంలో సుమారు 30 మందికి పైగా ఈ ప్రభావంతో మంచం పట్టారు. ఈ క్రమంలో కాకి రత్తమ్మ (30) వైరల్ ఫీవర్‌తో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసింది. పరిస్థితి తీవ్రతతో వైద్య బృందం మంగళవారం గ్రామానికి వచ్చి అనారోగ్యంతో మంచం పట్టిన వారి రక్త నమూనాలను సేకరించి ప్రత్యేక పరీక్షల కోసం పంపారు.

Advertisement
Advertisement