Sakshi News home page

టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లపై అనర్హత వేటు

Published Thu, Aug 14 2014 6:40 PM

rdo venkata ramana reddy axe over municipal councillors due to joined tdp after elect from ysrcp

నెల్లూరు:వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన అనంతరం టీడీపీలోకి వెళ్లిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. దీంతో జిల్లాలోని కావలి మున్సిపాలిటీలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆర్డీవో.. కావలి  మున్సిపల్ చైర్ పర్సన్ అలేఖ్యతో పాటు, 13 వ వార్డు కౌన్సిలర్ తోట వెంకటేశ్వర్లు టీడీపీలోకి వెళ్లడంతో వారిపై అనర్హత వేటు వేసినట్లు ప్రకటించారు. దీంతో ఆ స్థానాల్లో ఖాళీ అయినట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement