20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Mon, Aug 19 2013 9:58 AM

Red sandalwood seized in YSR District

కడప : వైఎస్ఆర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కాశీనాయన మండలం మల్లెపల్లి వద్ద ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు మోటార్ బైక్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం యధేచ్చగా తమ పని తాము చేసుకు పోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement