నలుగరు అరెస్ట్ : భారీగా ఎర్రచందనం స్వాధీనం | Sakshi
Sakshi News home page

నలుగరు అరెస్ట్ : భారీగా ఎర్రచందనం స్వాధీనం

Published Fri, Jun 26 2015 12:47 PM

Red sandalwood seized in YSR kadapa district

కడప : రైల్వేకోడూరు మండలం వాగేటికోన అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. నలుగరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.. 3 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.

వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పరారైన ఇద్దరి వ్యక్తుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement