తూ.గో:గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఎర్రచందనం స్మగ్లర్ అప్పూ అలియాస్ కృష్ణస్వామి సోమవారం మృతి చెందాడు. ఎర్రచందనం స్మగ్మింగ్ కేసులో కృష్ణస్వామిపై 33 కేసులు ఉన్నాయి. ఇందులో భాగంగానే నవంబర్ 26వ తేదీన స్మగ్లర్ కృష్ణస్వామి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణస్వామి అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు అతని లాయర్లు పిటిషన్ వేశారు. కాగా, ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణస్వామి ప్రాణాలు కోల్పోయాడు.