జేబులోనే పేలిన రెడ్‌మీ ఫోన్‌ | Sakshi
Sakshi News home page

జేబులోనే పేలిన రెడ్‌మీ ఫోన్‌

Published Sat, Oct 28 2017 12:17 PM

redmi 3s prime phone blast - Sakshi

చీరాల రూరల్‌(ప్రకాశం): ప్యాంటు జేబులో స్మార్ట్‌ ఫోన్‌ పేలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రకాశం జిల్లా చీరాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. హారిస్‌ పేటకు చెందిన దేట చక్రవర్తి రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నాడు. 8 నెలల క్రితం రెడ్‌మీ (3 ఎస్‌ ప్రైమ్‌ మోడల్‌) స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఫోన్‌ ప్యాంట్‌ జేబులోనే పేలిపోయింది.

ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్యాంటుకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన రెస్టారెంట్‌ సిబ్బంది మంటలను ఆర్పి, అతడి జేబులో నుంచి సెల్‌ఫోన్‌ను లాగి బయటపడేశారు. బాధితుడుకి తొడ భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement