దరఖాస్తు చేసింది 15,589
33 శాతానికి మించని హాజరు
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
విజయవాడ సెంట్రల్ : సివిల్స్ (ప్రిలిమినరీ) పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. నగరంలో 32 కేంద్రాల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. 15,589 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఉదయం 5,201(33.36) శాతం, మధ్యాహ్నం 5,133 (32.93) శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. మూడుసార్లకు మించి పరీక్ష రాసే అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో హాజరుశాతం తగ్గినట్లు అధికారులు అంచనా కట్టారు. ఒక్కో కేంద్రంలో 20 నుంచి 24 మంది విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేశారు. హాజరు శాతం తగ్గడంతో 2 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే కనిపించారు. అభ్యర్థులు లేక కొన్ని గదులు ఖాళీగా కనిపించాయి. శాతవాహన కళాశాల ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం లో 43 మందికిగాను 18 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం హాజ రైన అభ్యర్థుల్లో 68 మంది మధ్యాహ్నం డుమ్మా కొట్టారు. చివరి నిమిషంలో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు పరుగులు తీయాల్సి వచ్చింది.
పకడ్బందీగా ఏర్పాట్లు
బిషప్ అజరయ్య స్కూల్, శాతవాహన కళాశాల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బాబు.ఏ పరిశీలించారు. ఇన్విజిలేటర్లకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జేసీ-2 ఒంగోలు శేషయ్య ఆధ్వర్యంలో పని చేసిన నలుగురు అధికారుల బృం దం ఏర్పాట్లపై పర్యవేక్షణ చేశారు. సెల్ఫోన్లను తీసుకు వెళ్లకుండా నిరోధించారు. నిరుపయోగంగా పరీక్షలకు చెందిన బుక్లెట్స్ను కాల్చివేశా రు. ఉపకేంద్రాల నిర్వాహకుల సమస్యల్ని పరిష్కరించేందుకు గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేశా రు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నలుగురు అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ కళాశాల, గాంధీ, మాంటిస్సోరి, చైతన్య, ఆంధ్రా లయో లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌతం సవాంగ్ నేతృత్వంలో పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు.
సివిల్స్కు తగ్గిన హాజరు
Published Mon, Aug 24 2015 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement