షేల్ గ్యాస్ వెలికితీత నిర్ణయంపై ప్రజా సంఘాల వ్యతిరేకత
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో భూమి అట్టడుగు పొరల నుంచి సహజవాయువు (షేల్ గ్యాస్) వెలికితీయాలన్న ఓఎన్జీసీ నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారుు. షేల్గ్యాస్ వెలికితీత వల్ల పర్యావరణానికి, పంటలకు నష్టం వాటిల్లుతుందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారుు. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో భూమి అట్టడుగు పొరల (సుమారు 4 కిలోమీటర్ల దిగువ) నుంచి గ్యాస్ను వెలికితీసేందుకు సిద్ధమైన ఓఎన్జీసీ.. భీమవరం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు మునిసిపల్ ఆడిటోరియంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
జిల్లా అదనపు జారుుంట్ కలెక్టర్ ఎండీఘూ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం అరుపులు, కేకల మధ్య గందరగోళంగా మధ్యసాగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు పర్యావరణ వేత్తలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. గ్యాస్ వెలికితీసే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఆ గ్రామాలకు 18 కిలోమీటర్ల దూరంలోని భీమవరంలో నిర్వహించడంపై నిలదీశారు. ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న దృష్ట్యా అమెరికా వంటి ఆగ్రదేశాలు షేల్ గ్యాస్ వెలికితీతను విరమించుకోగా.. అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని ఓఎన్జీసీ సంస్థ మాత్రం బంగారం లాంటి పంటలు పండే పచ్చటి పొలాల మధ్య దీన్ని వెలికి తీయాలనుకోవడం తగదన్నారు.
డ్రిల్లింగ్ జరిగే గ్రామాల్లో ప్రజల మధ్య అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఓఎన్జీసీ కేజీ బేసిన్ మేనేజర్ ఎం.చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ వీఎస్ఎస్ కామరాజు, సీపీఎం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, బీవీ వర్మ, సీపీఐ నాయకులు డేగా ప్రభాకర్, ఎం.సీతారామ్ప్రసాద్, రైతు సంఘం నాయకుడు యెర్నేని నాగేంద్రనాథ్, గోదావరి పర్యావరణ పరిరక్షణ సమితి నాయకుడు మట్లపూడి సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి
Published Wed, Dec 7 2016 1:53 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!
T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement