సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ర్ట ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మున్సిపాల్టీలు, పట్టణ ప్రాంతాల్లోని అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని మున్సిపాలిటీలు, ఒంగోలు కార్పొరేషన్కు మొత్తం మీద పది కోట్ల రూపాయలకుపైగానే ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఒక్క ఒంగోలు కార్పొరేషన్కే 5.9 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 2008లో బీపీఎస్కు అనుమతి ఇచ్చినపుడు మొత్తం 1041 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 894 మందికి క్రమబద్ధీకరణకాగా మిగిలిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తిపన్ను పెంచేశారు. ఇప్పుడు వీరు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లేఅవుట్లు కూడా 15 వరకూ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
లేఅవుట్ వేసిన వారు అమ్మేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కొనుక్కున్న వారు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అంచనాకన్నా ఎక్కువ ఆదాయమే వస్తుందని భావిస్తున్నారు. మార్కాపురం పురపాలక సంఘంలో మొత్తం 324 మంది గతంలో తమ భవనాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 62మంది తమక్రమబద్ధీకరించుకున్నారు. మిగిలిన 262 మంది దరఖాస్తులను తిరస్కరించారు. పురపాలక సంఘానికి రూ.36.82 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తే కోటి రూపాయలకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. చీరాలలో 2008 సంవత్సరం వరకూ 914 భవనాలు క్రమబద్ధీకరించుకోగా కోటీ 90 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది.
ఇప్పుడు 166 భవనాలు లైన్లో ఉన్నాయని సుమారు రూ.60 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కందుకూరులో 125 వరకూ ఉండగా రూ.40 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. కొత్తగా నగర పంచాయితీలుగా ఏర్పడిన అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, సింగరాయకొండల్లో కూడా కాసుల వర్షం కురిస్తుంది. దీనివల్ల వీటికి కూడా అర్ధికంగా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. 2014 డిసెంబర్ 31నాటికి కార్పొరేషన్ వద్దరిజిస్టరైన భవనాలకే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తానికి ఈ పథకం పునరుద్ధరణతో రియల్టర్ల వల్ల మోసపోయిన సామాన్య ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అపార్టుమెంట్లలో ప్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటన్నింటినీ క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. అనధికారిక లే అవుట్లలో నిర్మించిన భవనాలకు ఈ పథకం వర్తించదు.
క్రమబద్ధీకరణతో ఆదాయం రూ.10 కోట్లపైనే
Published Wed, Feb 4 2015 4:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement