గుంటూరు క్రైం : బాధ్యతారహితంగా ఉన్న ప్రకాశం జిల్లా చినగంజాం ఎస్సై దిడ్ల కిషోర్బాబును విధుల నుంచి తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కిషోర్బాబు.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పలు మార్లు అధికారులు గుర్తించారు. తీరు మార్చుకోవాలని అధికారులు హెచ్చరించినా ఆయనలో మార్పు రాకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సై కిషోర్బాబును విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏఎస్సై సస్పెన్షన్
భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పామూరు ఏఎస్సై షేక్ గౌస్బాషాను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అదే గ్రామానికి చెందిన ఇల్లూరి రమణమ్మ ఈ ఏడాది జనవరి 28న భూ వివాదంలో మరో వర్గం వారు తనపై దాడికి యత్నించారని ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమిని ఖాళీ చేసే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏఎస్సై ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా కేసు నమోదు చేశారు. పోలీసు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏఎస్సై వ్యవహరించారని ఎస్పీ అందజేసిన నివేదిక ఆధారంగా ఏఎస్సై గౌస్బాషాను సస్పెండ్ చేస్తూ ఐజీ
ఉత్తర్వులు జారీ చేశారు.
ఒంగోలు క్రైం : చినగంజాం ఎస్సై పనితీరుపై ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కిశోర్బాబు తొలుత మద్దిపాడులో ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అక్కడి నుంచి చినగంజాం బదిలీ అయ్యరు. సాధారణంగా కొత్తగా ఎస్సై విధుల్లో చేరిన తర్వాత రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పిరియడ్ ఉంటుంది. అతని ప్రవర్తన, పనితీరు, ప్రజలకు సేవ చేసిన తీరుతెన్నులను పరిశీలించిన తర్వాత పోలీస్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. అనంతరం సబ్ఇన్స్పెక్టర్గా అప్గ్రేడ్ చేస్తారు. అప్గ్రేడ్ కాకుండానే తొలగించడం గమనార్హం.
చినగంజాం ఎస్సై తొలగింపు
Published Thu, Oct 2 2014 4:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement