అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరమని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్సాబ్ అన్నారు. పార్టీలకతీతంగా కలసిరావాలని జెడ్పీటీసీ సభ్యులకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్తు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి సమావేశంలో ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, మహిళ, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనులకు సంబంధించి ఏడు స్థాయీ సంఘాల కమిటీలు ఏర్పాటు చేశారు. చమన్సాబ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 42 మంది జెడ్పీటీసీ సభ్యులం ఉన్నామని, స్థాయీ సంఘాల కమిటీలలో అందరికీ అవకాశం కల్పించామన్నారు.
ఎంపీడీఓపై చర్యలు తీసుకోండి : సమస్యలపై ప్రశ్నించిన నల్లచెరువు వైఎస్సార్సీపీ సర్పంచ్పై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తానని బెదిరించిన ఎంపీడీఓ రమేష్బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు రవీంద్రరెడ్డి చైర్మన్ను కోరారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యేక గది ఏర్పాటు చేయండి : మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక గది కేటాయించి, ఒక అటెండర్ను ఏర్పాటు చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. నెలలోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. టోల్ప్లాజాల వద్ద ఉచితంగా తమ వాహనాల రాకపోకలను అనుమతించాలని సభ్యులు కోరగా.. సీఎంతో చర్చిస్తానన్నారు.సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సుభాషిణి, ఇచార్జ్ సీఈఓ సూర్యనారాయణ తోపాటు జెడ్పీటీసీ సభ్యులందరూ పాల్గొన్నారు.
అంతా ఏక పక్షమే !
స్థాయీ సంఘాల ఏర్పాటు, సభ్యుల నియామకం అంతా ఏక పక్షంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. అయితే సీఎం చంద్రబాబునాయుడు సూచన మేరకే టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బి.కె. పార్థసారథితో చర్చించి స్థాయీ సంఘాలు ఏర్పాటు చే శామని జెడ్పీ చైర్మన్ వివరించారు.
అందరి సహకారం అవసరం
Published Tue, Aug 26 2014 3:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement