శ్రీకాకుళం : గురుకులాలపై ఇకపై నిఘా పెరగనుంది. పటిష్ట భద్రతకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలికల పాఠశాల, కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో విద్యార్థినులకు రక్షణతోపాటు అధ్యాపకులు, సిబ్బంది పర్యవేక్షణ కోసం ఇటువంటి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ఏడు సాంఘిక సంక్షేమ బాలికలు, నాలుగు బాలుర సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటితోపాటు ఏపీ గురుకులాలు, నాలుగు బీసీ సంక్షేమ గురుకులాలు నడుస్తున్నారుు. అయితే తొలి విడతగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. అలాగే అధ్యాపకులు, సిబ్బంది, ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరవుతున్నారా, లేదా, సమయపాలన పాటిస్తున్నారా అనే విషయూలను గుర్తించేందుకుగాను బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నారు.
వారితోపాటు విద్యార్థుల హాజరును కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే నమోదు చేయనున్నారు. దీని ద్వారా ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది భోజనాలు చేస్తున్నారన్నది తెలుసుకోవచ్చన్నది అధికారుల భావన. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటునకు అవసరమైన పరిశీలన ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. జూలై మొదటి వారం లోగా వీటి ఏర్పాటు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
గురుకులాలపై ఇకపై నిఘా
Published Wed, Jun 29 2016 11:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement