మద్యం దుకాణాలపై దందా
కొత్తగా వచ్చిన అధికారుల వేధింపులు
నెలసరి మామూళ్ల కోసం ఒతిళ్లు
చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
అత్యంత అవినీతిమయమైన శాఖల్లో ఎక్సైజ్- 4వ స్థానంలో ఉంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న అధికారుల్లో కొందరు మాత్రం మొదటి స్థానంలో ఉండటానికి పెద్ద పెద్ద ఎక్సైజ్లే చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన సీఐల బదిలీల్లో పలు ప్రధాన స్టేషన్లకు వచ్చిన కొత్త అధికారులు కేసులకంటే నెలసరి మామూళ్లపైనే దృష్టి సారించారు. అంతా తెలిసినా ‘ నా వాటా ఎంత చెప్పు..?’ అంటూ ఉన్నతాధికారులు లెక్కలు సరి చేసుకుంటున్నారు.
చిత్తూరు (అర్బన్): జిల్లా ఎక్సైజ్ శాఖలో దీర్ఘకాలంగా ఒకే స్టేషన్లలో పనిచేస్తున్న సీఐలకు బదిలీలు చేస్తూ గత నెల 21న ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న కొందరు సీఐలను పక్క మండలాలకు, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇతర జిల్లాల్లో ఉన్న సీఐలను మన జిల్లాకు కూడా బదిలీ చేశారు. ఇలా మొత్తం 34 మంది సీఐలు బదిలీ అయ్యారు. అయితే కొత్త స్టేషన్లకు వెళ్లిన సీఐలు తమ విధులను పక్కనపెట్టి, జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారు. సర్కిళ్ల నుంచి డిస్టిలరీలు, చెక్పోస్టులు.. ఇలా ప్రతీ చోటా వసూళ్ల దుకాణాలు తెరిచారు. సర్కిళ్లల్లో పనిచేస్తున్న సీఐలు ఆ పరిధిలో ఉన్న లెసైన్స్ కలిగిన మద్యం దుకాణాల యజమానులను పిలిపించి బెదిరింపులకు దిగుతున్నారు. ప్రాధాన్యత, మద్యం దుకాణాల్లో జరిగే వ్యాపారం ఆధారంగా ఒక్కో దుకాణ యజమాని నుంచి ఒక్కో మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ మామూళ్లు నెలకు కనిష్టంగా రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.80 వేల వరకు ఉంటోంది. తిరుపతిలో అయితే కొన్ని దుకాణాల కొత్త సీఐలు నెలకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
ఇదేమిటని అడిగితే ప్రాధాన్యత ఉన్న పోస్టు కోసం పైస్థాయిలో రూ.లక్షలు ముట్టచెప్పి వచ్చామని, ఆ మాత్రం ఇచ్చుకోకపోతే ఎలా? అంటూ కొందరు సమర్థించుకుంటున్నారు. గతంలో కూడా ఇదే తరహా వ్యవహారం జరగడంతో చిత్తూరులోని ఎక్సైజ్ సూపరింటెండెండ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయినా ఆశాఖలో అవినీతి కిక్కు దిగడం లేదు.
ఎక్సైజ్శాఖలో ఈ దందాల వ్యవహారంపై ఉన్నతాధికారులు పెదవి విప్పడం లేదు. సీఐలు వసూలు చేసే నెలసరి మామూళ్లలో ఉన్నతాధికారులకు సైతం లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఎన్ఫోర్సుమెంట్లో పనిచేసి ఇటీవల సర్కిల్కు వెళ్లిన పేరు వెల్లడికి ఇష్టపడని ఓ సీఐ చెప్పారు.
ఏమయ్యా.. నేను చార్జ్ తీసుకుని 15 రోజులవుతోంది. ఇప్పటి వరకు కనిపించలేదు. కనీసం పలకరించాలని కూడా తెలియదా..? ఏం వ్యాపారం చేసుకోవాలని ఉందా, లేదా.? ఇంతకుముందు ఎలాగ ఉండేదో మా కానిస్టేబుళ్లు అంతా చెప్పారు. నేను చాలా స్ట్రిక్ట్. గతంలో జరిగింది వదిలేయ్. ఇప్పుడు నెలకు రూ.40 వేలు ఇవ్వాల్సిందే. లేకుంటే నీ ఇష్టం..
- చిత్తూరు ఈఎస్ పరిధిలోని ఓ సీఐ
తప్పుడు మార్గాల్లో డిస్టిలరీ నిర్వాహకుల నుంచి విధుల్లోకి చేరిన 15 రోజుల్లోనే రూ.లక్ష వరకు వసూలు చేశారా సీఐ. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఇది తానొక్కడికే కాదని, ఉన్నతాధికారులకు సైతం ఇవ్వాలని చెబుతున్నారు.
వసూళ్ల ‘ఎక్సైజ్’ రాజాలు!
Published Wed, Oct 7 2015 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement