పలాస: తహశీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ అధికారుల అవినీతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏం జరుగుతుందోనని కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ‘ఆహా... ఏమి కృప’ శీర్షికన ఫిబ్రవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధి నర్సిపురంలోని సర్వే నంబరు 187లో 5.78, సర్వే నంబరు 188లో 3.89 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 9.67 ఎకరాల ఈ స్థలంలో 620 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి అధికారులు లేఅవుట్లు వేశారు. 2003లో లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చారే గానీ లబ్ధిదారులకు స్థలాలు చూపించలేదు.
దీంతో ఎమ్మెల్యే, తహశీల్దార్ కార్యాలయం అధికారులు మారినప్పుడు ఈ స్థలంలోనే మరికొందరికి పట్టాలు పుట్టుకొచ్చాయి. ఇది అవినీతి అధికారులకు కాసుల పంట కురిపించింది. సార్వత్రిక ఎన్నికల ముందు బదిలీ అయిన అప్పటి తహశీల్దార్ ఎల్.పార్వతీశ్వరరావు కూడా సుమారు 100 మందికి పట్టాలు ఇచ్చారని, రూ.కోటి చేతులు మారుంటాయన్న ఆరోపణలు వినిపించాయి. అప్పటి కేంద్ర మంత్రి కృపారాణి ఆశీస్సులతో పార్టీ కార్యకర్తలకు పట్టాలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సూదికొండ, నెమలినారాయణపురం, ఇంగిలిగాం, పెంటిభద్ర, తర్లాకోట తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి వెళ్లాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
అధికారుల నుంచి డీ పట్టాలు పొందిన అనంతరం వాటిని పక్క జిరాయితీ సర్వే నంబర్లు వేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర వాటికి వినియోగిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాలా పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ విధంగా పలాస-కాశీబుగ్గ పట్టణంలో ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. వాగులు, వంకలు ఇప్పటికే పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. వీటిపై పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు పలాస తహశీల్దార్ కార్యాలయంపై దృష్టి సారించినట్లు సమాచారం. తహశీల్దార్ కార్యాలయంలో దిగువ స్థాయి సిబ్బంది చెప్పిందే వేదంగా పనులు జరుగుతున్నట్టు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టిసారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పలాస ‘రెవెన్యూ’పై ఏసీబీ ఆరా!
Published Mon, Jul 7 2014 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement