లారీ - బైక్‌ ఢీ.. | Sakshi
Sakshi News home page

లారీ - బైక్‌ ఢీ..

Published Thu, May 18 2017 10:38 AM

road accident in east godavari 2dies

► ఇద్దరి మృతి

పెందుర్తి: విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలం చినగాడివద్ద 16వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లి ప్రాంతానికి చెందిన శ్రీను, గణేశ్‌ అనే ఇద్దరు యువకులు పెందుర్తి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.

ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement