రేపు ఎల్లుండి రహదారుల దిగ్బంధం | Sakshi
Sakshi News home page

రేపు ఎల్లుండి రహదారుల దిగ్బంధం

Published Tue, Nov 5 2013 1:42 AM

roads to be blockade on november 6th and 7th

సాక్షి, గుంటూరు : ప్రభుత్వం 2011 అక్టోబరు 2 నుంచి జిల్లాలో ఇందిర జలప్రభ అమలును ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన బంజరు భూములను ఎంపిక చేసి బోర్లు వేసి సస్యశ్యామలం చేయడమే పథకం లక్ష్యం. దీనికోసం జిల్లా అధికారులు 16 మండలాలను ఎంపిక చేశారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, గురజాల, కారంపూడి, దాచేపల్లి, నూజెండ్ల, ఈపూరు, వినుకొండ, బొల్లాపల్లి, మాచవరం, బెల్లంకొండ,  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలంతా రాష్ట్ర విభజనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలిపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అన్ని మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. కాంగ్రెస్,టీడీపీల కుట్రలను ఛేదించే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు.
 
 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు పాటుపడుతున్న జననేతకు ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర విభజనను అడ్డుకుని, ప్రజా ప్రయోజనాలను జననేత కాపాడతారన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిని, నియోజకవర్గంలో విస్తరించిన రాష్ట్రీయ రహదారులను 48 గంటల పాటు దిగ్బంధం చేస్తామని తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement