విశాఖపట్నం, న్యూస్లైన్: అద్దెకు ఇల్లు కావాలని వెళ్లి ఇల్లు చూపిస్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడు తెంచేయడమేకాక ఆమెపై హత్యాయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులను పెందుర్తి క్రైం పోలీసులు బుధవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త ఏసీపీ సి.ఎం.నాయుడు తెలిపిన వివరాలివి. పెందుర్తి బ్రాహ్మణ వీధిలో ఆళ్ల సత్యనారాయణకు ఓ ఇల్లుంది. ఈ ఇంటిని ఎవరైనా అద్దెకు అడిగితే ఇవ్వాలంటూ తాళాలను ఆయన వీధిలో ఉన్న పీలా జయలక్ష్మికి అప్పగించారు.
ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన కింజరాపు రాములు (33), బాలి చంద్రశేఖర్ అలి యాస్ శేఖర్ (20)లు అద్దెకు ఇల్లుందా అంటూ జయలక్ష్మిని సంప్రదించారు. ఆమె అదే వీధిలో ఉంటున్న దొడ్డి సత్యవతికి తాళాలు ఇచ్చి వచ్చిన వారికి ఇల్లు చూపించాలని కోరింది. దీంతో సత్యవతి రాములు, శేఖర్ను రెండో అంతస్తులో ఉన్న ఇల్లు చూపించేందుకు తీసుకువెళ్లింది. గది తలుపుతీసి సత్యవతి ఇంటిలోకి వెళ్లగా రాముల్ని బయట నిలబడమని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లాడు. సత్యవతి వెనుకగా వెళ్లి ఆమె నోట్లో గు డ్డలు కుక్కి మెడలో ఉన్న నాలుగు తులా ల పుస్తెలతాడును తెంచేశాడు.
ఈ హఠాత్పరిణామంతో అవాక్కయిన సత్యవతి గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్ద రూ ఆమెను పీకనులిమి చంపే ప్రయత్నం చేశారు. చాలాసేపైనా సత్యవతి రాకపోవడంతో అనుమానం వచ్చిన జయలక్ష్మి మేడపైకి వెళ్లగా అక్కడ సత్యవతిపై హత్యాయత్నం జరుగుతుండడాన్ని చూసి గట్టిగా అరిచింది. దీంతో నిందితులిద్దరూ సత్యవతిని వదిలేసి 16 అడుగుల మేడపై నుంచి దూకి పారిపోయారు. బాధితురాలి కుమారుడు దొడ్డినరసింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం సీఐ ఎస్.అడమ్, ఎస్ఐ ప్రసాద్లు ఘ టనా స్థలికి చేరుకుని విచారణ జరిపారు. స్థానికులు తెలిపిన ఆధారాల మేరకు నిందితులపై నిఘా పెట్టారు. బుధవారం నిందితులు విశాఖ నగరానికి వెళ్లేందుకు పెందుర్తి రైల్వేస్టేషన్లో వేచి ఉండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.
ఈజీ మనీ కోసం...
నిందితుల్లో రాము ఆర్టీసీలో డ్రైవర్. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. డబ్బుల కోసం ఒత్తిడి పెరగడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చంద్రశేఖర్ బీకాం చదువుతున్నాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరూ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దోపిడీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు
Published Thu, Sep 26 2013 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement