మహాలక్ష్మమ్మ ఆలయంలో చోరీ | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మమ్మ ఆలయంలో చోరీ

Published Sun, Jul 26 2015 8:37 AM

Robbery in Temple

రణస్థలం (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడాం గ్రామంలోని మహాలక్ష్మమ్మ ఆలయంలో శనివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదును ఎత్తుకుపోయారు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించటంతో విషయం వెలుగుచూసింది. సర్పంచి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement