'చంద్రబాబు దొంగ అని రుజువైంది' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు దొంగ అని రుజువైంది'

Published Sun, Jun 21 2015 8:31 PM

'చంద్రబాబు దొంగ అని రుజువైంది' - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓట్లకు కోట్లు కేసును రాజీ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా విమర్శించారు. కృష్ణా జలాల పంపిణీలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని రోజా అన్నారు. పాలమూరు ఎత్తిపోతల వల్ల రాయలసీమకు నష్టం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. స్టీఫెన్సన్ వాంగ్మూలంతో చంద్రబాబు దొంగ అని మరోసారి రుజువైందని రోజా విమర్శించారు.
 

Advertisement
Advertisement