ఆర్యవైశ్యుల్లో ఐక్యత తెచ్చిన ఐలయ్య: రోశయ్య | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యుల్లో ఐక్యత తెచ్చిన ఐలయ్య: రోశయ్య

Published Mon, Sep 18 2017 2:30 AM

ఆర్యవైశ్యుల్లో ఐక్యత తెచ్చిన ఐలయ్య: రోశయ్య - Sakshi

మచిలీపట్నంటౌన్‌ (మచిలీపట్నం): ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య చేసిన వ్యాఖ్యలతో ఆర్యవైశ్యుల్లో ఐక్యత వచ్చిందని రాష్ట్ర మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. కృష్ణా జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య పుస్తకాన్ని రాయటంతో పాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటంతో ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెరిగిందని చెప్పారు. అందువల్లే ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఐలయ్య తన వ్యాఖ్యలను  ఉపసంహరించుకుంటే హుందాగా ఉంటుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement