=ఒకరి మృతి
=40 మందికి అస్వస్థత
=నలుగురి పరిస్థితి విషమం
=ప్రత్యేక వైద్య బృందాలు పంపాలని కలెక్టర్కు మంత్రి ఆదేశం
గూడెంకొత్తవీధి, న్యూస్లైన్: గిరిజనుల ఆహారపు అలవాటు మరోసారి ‘విష’మించింది. మారుమూల గూడేల్లోని ఆదివాసీలు చనిపోయిన పశు ల, నిల్వ మాంసం తిని ప్రాణాలమీదికి తెచ్చుకుం టున్నారు. జీకే వీధి మండలం రంపుల గ్రామంలో ఇదే చోటుచేసుకుంది. ఓ గిరిజనుడు చనిపోగా, మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. పాముకాటుకు గురై చనిపోయిన పశువు మాంసాన్ని గ్రామంలోని 40 కుటుం బాల వారు శనివారం రాత్రి వండుకుతిన్నారు. అది వికటించింది. ఒక్కసారిగా గ్రామంలోని వారంతా అనారోగ్యానికి గురయ్యారు.
వాంతు లు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో కొర్ర మాలతి(40) ఆదివారం ఉదయం మృతి చెందాడు. చిన్నారులు కొర్ర గీతా(8), వాసు(5), దేవరాజు(4), పాంగి లక్ష్మీ(14)ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంజీవరావు(15)తోపాటు కొర్ర సీతా(42), కె.మూర్తి(32), లక్ష్మీ(30), పి.శాంతి(5), పి.లక్ష్మీ(28)లతోపాటు మరో 30 మందికిపైగా అనారోగ్యంతో అల్లాడుతున్నారు. పెదవలస పీహెచ్సీ వైద్యాధికారి అశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని బాధితులకు వైద్యసేవలు అందించారు.
పరిస్థితి విషమంగా ఉన్నవారందరిని అంబులెన్స్లో పెదవలస పీహెచ్సీకి తరలించి అత్యవసర సేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖ కేజీహెచ్కు తరలిస్తామని జీకే వీధి,చింతపల్లి క్లస్టర్ అధికారి శర్మ తెలిపారు. ప్రత్యేక వైద్యబృందాలను రప్పిస్తున్నామన్నారు. విషయం తెలిసిన మంత్రి బాలరాజు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక బృందాలను గ్రామానికి పంపాలని జిల్లా కలెక్టర్, వైద్య,ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో తక్షణం క్లోరినేషన్ చేపట్టాలని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖ తరలించాలన్నారు.
విషమించిన ఆహారం
Published Mon, Dec 9 2013 1:58 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement