ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్ : జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 213.25 కోట్ల రూపాయలతో వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మొత్తంలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి 191.73 కోట్ల రూపాయలు, 37 కస్తూరిబా గాంధీ విద్యాలయాల (కేజీబీవీల) నిర్వహణకు 21.52 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది జిల్లాలోనే వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గతంలో ఈ ప్రణాళికను హైదరాబాద్లోనే తయారు చేసి అక్కడే సమర్పించి వచ్చేవారు.
అయితే, ఈ ఏడాది జిల్లాలోనే ప్రణాళికను రూపొందించి కలెక్టర్ ఆమోదంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ (ఎస్పీడీ)కి సమర్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఏ రాజేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ ఏఎస్వో ఎన్.అంజిరెడ్డి తెలిపారు. ఈ ప్రణాళికను ఎస్పీడీ కార్యాలయంలో ఆమోదించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళికను ఆమోదించిన అనంతరం జిల్లాకు నిధులు కేటాయిస్తారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో సింహభాగం.. అంటే 44.77 కోట్ల రూపాయలు సివిల్ వర్కులకు కేటాయించారు.
ఈ మొత్తంలో ప్రహరీల నిర్మాణానికి 27.22 కోట్లు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేకంగా హెచ్ఎం గదులు నిర్మించేందుకు 3.96 కోట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల మరమ్మతులకు 3.56 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి 1.26 కోట్లు, తాగునీటికి కోటి, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎం గదుల నిర్మాణాలకు 5.44 కోట్లు, మరమ్మతులకు 46 లక్షల రూపాయలు కేటాయించారు.
ప్రణాళికలోని అంశాలు ఇవీ...
జిల్లాలోని 2,63,840 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేసేందుకు 10.55 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించారు. 1,36,666 మంది బాలికలకు 5.46 కోట్లు, ఎస్సీ బాలురు 46,442 మందికి 1.85 కోట్లు, ఎస్టీ బాలురు 10,188 మందికి 40.75 లక్షలు, దారిద్య్రరేఖకు దిగువనున్న బాలురు 70,544 మందికి 2.82 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
రెగ్యులర్ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉపాధ్యాయుల జీతాలకు 61.52 కోట్ల రూపాయలు
మండల విద్యా వనరుల కేంద్రాల అభివృద్ధికి, రిసోర్సు పర్సన్లు, సీడబ్ల్యూఎస్ఎస్ రిసోర్స్ పర్సన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టీఎల్ఎం గ్రాంటుకు 10.56 కోట్లు, పాఠశాలల సముదాయాల అభివృద్ధికి, క్లస్టర్ కో ఆర్డినేటర్ల జీతాలకు 4.30 కోట్ల రూపాయలు
పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల కొనుగోలుకు 5.34 కోట్ల రూపాయలు
పాఠశాలల నిర్వహణ గ్రాంటుగా 2.32 కోట్లు, మూడు తరగతులున్న 2,484 పాఠశాలలకు 1.24 కోట్లు, మూడు కంటే అదనంగా తరగతి గదులున్న 1,079 పాఠశాలలకు 1.08 కోట్ల రూపాయలు
పాఠశాల గ్రాంటుగా 2.21 కోట్లు, 3,236 ప్రాథమిక పాఠశాలలకు 1.62 కోట్లు, 849 ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలలకు 59.43 లక్షలు
ఉపాధ్యాయ గ్రాంటుగా 68.62 లక్షలు, ఈ మొత్తంలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 9,180 మంది టీచర్లకు ఒక్కొక్కరికి 500 చొప్పున 46 లక్షలు, ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలల్లో పనిచేస్తున్న 4,544 మంది టీచర్లకు 23 లక్షలు
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 3.35 కోట్లు, ఈ మొత్తంతో ఫిజియోథెరపీ శిక్షణ కేంద్రాలు, ఉపకరణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల నిర్వహణ
బాలికా విద్య కార్యక్రమాలకు 20 లక్షలు, విద్యాహక్కు చట్టంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు 15 లక్షలు
బడి బయట ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి వారిని రెగ్యులర్గా పాఠశాలల్లో చేర్పిం చేందుకు ఆర్ఎస్టీసీలు, ఎన్ఆర్ఎస్టీసీ లు, దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు హాజరయ్యే పిల్లలకు రవాణా ఖర్చులు చెల్లించేందుకు 5.38 కోట్ల రూపాయాలు
ప్రాజెక్టు నిర్వహణకు 3 శాతం నిధులు (4.73 కోట్ల రూపాయలు)
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల నిర్వహణకు 21.52 కోట్ల రూపాయలు
విద్యార్థినులకు మెస్ చార్జీలు, ఇతర వసతులకు ఒక్కొక్కరికి నెలకు 900 చొప్పున 4.80 కోట్లు, ఒక్కొక్కరికి 50 చొప్పున నెలవారీ స్టైఫండ్ చెల్లించేందుకు 26.64 లక్షల రూపాయలు
కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు, స్పెషలాఫీసర్ల జీతాలు చెల్లించేందుకు 8.42 కోట్ల రూపయాలు
బాలికలకు వైద్య ఖర్చులకు 33 లక్షలు, యూనిఫారాలు పంపిణీ చేసేందుకు 66 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించారు.
జిల్లాలో విద్యాభివృద్ధికి రూ.213 కోట్లు
Published Wed, Feb 19 2014 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement