సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు రూ.4 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, దుర్గగుడి ఈవో వి.త్రినాథరావు తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో వారు సమీక్ష సమావేశం రూ.4 కోట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ గత ఏడాది ఉత్సవాలకు సుమారు రూ.4 కోట్లు ఖర్చయ్యాయని, ఈ ఏడాది కూడా అంతే ఖర్చు చేస్తున్నామన్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. స్నానఘాట్లను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 నుంచి జరిగే ఉత్సవాల కోసం ప్రత్యేక కేశఖండన శాలలు, వస్త్రాలు మార్చుకునేందుకు గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని ఆమె వివరించారు. అమ్మవారికి ఉచితంగా తలనీలాలు సమర్పించే అవకాశం కల్పిస్తున్నామన్నారు. భక్తులు ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని, దేవస్థాన సమాచార కేంద్రాల ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
ఈవో త్రినాథరావు మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులకు సహాయం చేసేందుకు 900 మంది వలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. 11 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేస్తామని, సుమారు 90వేల మంది భక్తులకు కావాల్సిన ప్రసాదాలను సిద్ధం చేస్తామని వివరించారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాల సిబ్బందితో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, కార్పొరేషన్, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది సహాయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలు వినియోగించుకుంటామన్నారు.
అదనపు డీసీపీ టీవీ నాగరాజు మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా 4,500 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, ఎస్సీసీ క్యాడెట్లను నియమిస్తామన్నారు. వివిధ పాంత్రాల నుంచి వచ్చే వాహనాలకు తాత్కాలిక పార్కింగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ ఎస్.రాఘవరావు, సబ్ కలెక్టర్ ఏవో జయశ్రీ, దేవస్థానం ఈఈ రమాదేవి, ఏఈవో అచ్యుతరామయ్య, తహశీల్దార్ ఆర్.శివరావు తదితరులు పాల్గొన్నారు.
దసరా @రూ.4 కోట్లు
Published Wed, Sep 10 2014 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement