సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించుకోవటానికి 1.50 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. ఇల్లు దెబ్బతింటే రూ.10 వేలు పరిహారం ఇస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం ఉన్నతాధికారులతో తుపాను అనంతర పరిస్థితి, సహాయ పునరావాసంపై చర్చించి నష్టపరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని, ఇతర పంటలకు నిబంధనల మేరకు పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
అరటి తోటలకు ఎకరానికి రూ.30 వేల పరిహారం, జాతీయ ఉపాధిపథకం పథకం కింద కొబ్బరి మొక్కలు నాటి మూడేళ్ల వరకు సంరక్షణకు ఎకరానికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తామని, కొబ్బరి చెట్లు నష్టపోయిన రైతులకు చెట్టుకు రూ.1,200 వంతున చెల్లించనున్నట్లు తెలిపారు. నష్టపోయిన జీడిమామిడి తోటల రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం, ఎకరానికి రూ.40 వేల చొప్పున ఉపాధి హామీ పథకం కింద తోటల అభివృద్ధికి సాయం చేస్తామన్నారు. పడవలు పూర్తిగా ధ్వంసమైన మత్స్యకారులకు మెకనైజ్డ్ బోట్ అయితే రూ.6 లక్షలు, సాధారణ పడవలకు రూ.లక్ష, వలను నష్టపోయిన మత్స్యకారులకు వల ఒక్కోదానికి రూ.10 వేలు పరిహారం చెల్లిస్తామన్నారు. దెబ్బతిన్న ఆక్వా రైతులకు ఎకరానికి రూ.30 వేలు, తుపాను ప్రభావంతో మృతి చెందిన పశువులకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తామన్నారు. గొర్రెలు, మేకలు మృతి చెందితే ఒక్కోదానికి మూడు వేలు, దెబ్బతిన్న పశువుల కొట్టాలు ఒక్కో దానికి రూ.10 వేల నష్టపరిహారాన్ని యజమానులకు చెల్లిస్తామన్నారు.
యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టండి: సీఎస్
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాన్ బారిన పడిన మండలాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయం నుంచి తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస పనులపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తిత్లీ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం
Published Mon, Oct 15 2018 4:16 AM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఆ ముసలోడికి ఏం రోగం..కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
బీసీలను ఆదరించడంలో సీఎం జగన్ ముందుంటారు: కొడాలి నాని
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
మత్స్యకారులకు గుడ్ న్యూస్
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement