విజయనగరం అర్బన్: సంస్థకు సేవలందించిన ఉద్యోగుల వారసుల పట్ల ‘కారుణ్యం’ చూపాల్సిన ఆర్టీసీ అధికారులు కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. విధి నిర్వహణలో ఉంటూ అకాల మరణం పాలైన ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడకుండా వారసులకు ఉద్యోగాలివ్వాలని చట్టం శాసించినా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అప్పుడప్పుడు అరకొర ఉద్యోగాలను భర్తీ చేస్తామనిప్రకటించి కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా బాధిత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. 1998 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ నార్త్ఈస్టు కోస్టు(నెక్) రీజియన్ పరిధిలోని ‘కారుణ్య’ నియామకాలకు అర్హులు 600 మందికిపైగా ఉన్నారు. వీరి కోసం ఎప్పటికప్పడు పోస్టులను మంజూరు చేయాల్సిన అధికారులు తమ తోచినపుడు పరిమిత సంఖ్యలో భర్తీ చేస్తున్నారు.
ధ్రువీకరణపత్రాల పరిశీలనలో జాప్యం.. అభ్యర్థుల పాట్లు
తాజాగా నెక్ రీజియన్ అధికారులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని డిపోల పరిధిలో కేవలం 116 కారుణ్య పోస్టులను ప్రకటించారు. వీటిలో 45 పోస్టుల భర్తీ ప్రక్రియను బుధవారం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో చేపట్టారు. భర్తీ చేస్తున్న పోస్టులు 45 ఉండగా సీనియార్టీ ప్రాతిపదకన 94 మంది అభ్యర్థులను పిలిచారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని ప్రారంభించకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడ్డారు. గంటల తరబడి ఎండలో నిరీక్షించలేక నరకయాతన అనుభవించారు. విజయనగరం జిల్లాలోని 37 కండక్టర్ పోస్టుల కోసం వచ్చిన 44 మంది, శ్రీకాకుళం జిల్లాలోని 8 పోస్టుల కోసం వచ్చిన 54 మంది ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. విజయనగరం జిల్లా పోస్టుల్లో డిపోలకు 33, నాన్ ఆపరేషన్ విభాగానికి 4 పోస్టులు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు కండక్టర్లు, నాలుగు శ్రామిక పోస్టులున్నాయి. వీటిలో సగం పోస్టులను మహిళలకు కేటాయించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ అప్పలనారాయణ, డీప్యూటీ సీటీఎం కె.శ్రీనివాసరావు (శ్రీకాకుళం), ఆర్ఎం కార్యాలయం పీవో మల్లికార్జునరాజు, సహాయ మేనేజర్ జె.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కారుణ్యం కాదు..కాఠిన్యం!
Published Thu, Jul 9 2015 4:03 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప
రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారి !
దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ
అవగాహన లేమి.. తగ్గుతున్న దిగుబడి!
గుణాత్మక బోధనతో మంచి ఫలితాలు
సూర్యాపేట
భీంరెడ్డి పోరాట చరిత్ర మరువలేనిది
పుత్తూరులో సీఎం జగన్ రోడ్ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
వాతావరణం చల్లబడింది
మట్టపల్లిలో నిత్యకల్యాణం
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement