ఎస్కేయూ, న్యూస్లైన్ : ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచేలా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవాలంటే విద్యార్థులు, యువకులు చేసే ఉద్యమంతోనే సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎస్కేయూలో ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ , సీమాంధ్రలో రెండుచోట్లా అధికారం చెలాయించాలనే దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. సోనియా తన కుమారుడు రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు చిదంబరం, దిగ్విజయ్సింగ్తో కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకని ఏ ప్రజాప్రతినిధినైనా నిలదీసే హక్కు ఉందని గుర్తుచేశారు. రాష్ర్ట విభజన నిర్ణయం వెనక్కు తీసుకుని, సమైక్యాంధ్రప్రదేశ్గానే కొనసాగించేలా విద్యార్థులు ఉద్యమం ద్వారా సోనియాపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ర్టపతి అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు అలీఖాన్ మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ రాజేశ్వరరావు. కన్వీనర్ డాక్టర్ సదాశివరెడ్డి పాల్గొన్నారు.
మిన్నంటిన ఉద్యమం
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సమైక్య ఉద్యమం మిన్నంటుతోంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు అనంతపురం-చెన్నై రహదారిపై రాస్తారోకో చేశారు. అత్యవసర సేవలు మినహా లారీలు, జీపులు తదితర వాహనాలను పిలిపివేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, సోనియా, ఢిల్లీ పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా కోరారు. అనంతరం సమైక్యవాదులు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ర్టంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేయాలని పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందితే తమ రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న భయంతోనే ఆజాద్, దిగ్విజయ్సింగ్, చిదంబరం విభజనకు కుట్ర పన్నారని ఆరోపించారు. తెలుగుతల్లిని చీల్చి పండుగ చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సీమాంధ్ర ప్రజలు డబ్బులు దండుకుని ఉద్యమాలు చేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. డబ్బు తీసుకున్నట్లు నిరూపించగలరా అంటూ తెలంగాణవాదులను సవాల్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపి.. సమైక్యాంధ్రను రక్షించుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోకు ముందు ఆకుతోటపల్లి నుంచి మహిళలు చిన్నారులతో కలిసి ర్యాలీగా వచ్చి మద్దతు ప్రకటించారు.
రోడ్డుపైనే వంటావార్పు
ఉదయం నుంచి సాయంత్రం వరకు రాస్తారోకోలో పాల్గొన్న సమైక్య వాదులు రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. ఉదయం దాదాపు వెయ్యిమందికిపైగా రోడ్డుపైనే భోజనం చేశారు. రాత్రి 7గంటల సమయంలో కూడా రోడ్డుపైనే భోజనం చేసి తమ నిరసన తెలియజేశారు.
రెండో రోజూ కొనసాగిన రిలే దీక్షలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జేఏసీ నాయకులు ఎస్కేయూలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండో రోజు మంగళవారం కూడా కొనసాగాయి. తెలుగుజాతి ప్రజలు నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం కాకుండా చూస్తామని ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉన్నం రాజేశ్వరరావు అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా సోనియాగాంధీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని నిర్ణయం వెలువరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిలేదీక్షల్లో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మల్లెల నాగేంద్ర, లక్ష్మీనారాయణ, వెంకట్రాముడు, ఓబులపతి, పెద్దన్న పాల్గొన్నారు.
ఉద్యమంతోనే ‘సమైక్యం’
Published Wed, Aug 7 2013 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement