త్రిపురాంతకం,న్యూస్లైన్: సాగర్ ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా లింగాలపల్లి వద్ద సాగర్ ప్రధాన కాలువకు గండి పడడంతో నాలుగు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతన్నలు గాభరా పడ్డారు. కానీ బుధవారం నాటికి పరిస్థితి చక్కబడింది. మేజర్లకు నీటి సరఫరా జరుగుతుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గుంటూరు- ప్రకాశం జిల్లాల సరిహద్దు 85-3 వద్ద మొదటి రోజు 2070 క్యూసెక్కుల నీరు విడుదలకాగా.. గురువారం 2700 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు డీఈఈ సత్యకుమార్ తెలిపారు.
మొన్నటి దాకా నీరు లేక వరినాట్లు ఎండుముఖం పట్టడంతో కష్టాలు తప్పవని అన్నదాత నిరాశ చెందాడు. కానీ పరిస్థితి అనుకూలంగా మారడంతో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. భూములను దమ్ము చేస్తున్నారు. నీటి సరఫరా ఇదేవిధంగా కొనసాగితే ఆయకట్టు చివరి భూములకు కూడా ఇబ్బంది ఉండదు. దీని కోసం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంది. కాగా సాగర్ జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఖరీఫ్లో సక్రమంగా నీరు విడుదలవ్వక చాలా చోట్ల పంటలు సాగులోకి రాలేదు.
ఇప్పటికి నలభై శాతమే!
జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద 4.35 లక్షల ఎకరాలుండగా ఇప్పటికి సుమారు నలభై శాతం భూముల్లో మాత్రమే వరి సాగులోకి వచ్చింది. ప్రస్తుతం కాలువకు ఎగువ భూములే కళకళలాడుతున్నాయి. సాగర్ కాలువకు సమృద్ధిగా నీరు వస్తే తప్ప మిగిలిన భూములు తడవవు. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా రైతులు అప్పులతో మిగిలిపోవాల్సిందే.
జిల్లాకు సాగర్ జలాలు
Published Thu, Oct 3 2013 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement