సాయిబాబా కించపరిచిన స్వరూపానందపై భక్తుల ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

సాయిబాబా కించపరిచిన స్వరూపానందపై భక్తుల ఆగ్రహం!

Published Wed, Jun 25 2014 1:44 PM

సాయిబాబా కించపరిచిన స్వరూపానందపై భక్తుల ఆగ్రహం!

హైదరాబాద్: షిర్డీ సాయిబాబాను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన స్వరూపానందస్వామిపై షిర్డీ సాయి భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. 
 
పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను కించపరిచిన స్వరూపానంద క్షమాపణ చెప్పాలని భక్తులు, షిర్డీ సాయి తత్వ ప్రచార కమిటీ డిమాండ్ చేశారు. స్వరూపానందస్వామి తీరుపై సినీనటుడు మోహన్ బాబుతోపాటు పలువురు ప్రముఖులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement