20వ తేదీలోగా సాక్షి స్పెల్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

20వ తేదీలోగా సాక్షి స్పెల్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి

Published Sat, Oct 11 2014 3:44 AM

20వ తేదీలోగా సాక్షి స్పెల్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి

విజయనగరం టౌన్: సాక్షి ఇండియా స్పెల్ బీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్పెల్‌బీ’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్పెల్‌బీలో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా, విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగల సెలవులు రావడంతో  రిజిస్ట్రేషన్‌ల గడువును పెంపుదల చేయాలంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల కోరిక మేరకు ఈ నెల 20 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌లను త్వరితగతిన చేయించుకునేందుకు  పాఠశాలల యజమానులు సిద్ధం కావాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వారు 9951602843 నంబరును సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement