తిరుపతి కల్చరల్: సాక్షి దినపత్రిక, టీవీ, పిడిలైట్, ఉషా కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి నగరంలో నిర్వహించిన సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో భాగంగా బైరాగిపట్టెడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యువలరీ అండ్ ఫ్యాషన్ డిజైన్ సంస్థ కార్యాలయంలో గృహిణులకు స్వయం ఉపాధికై చేతి వృత్తులపై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని సుమారు 80 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి మైత్రీమహిళ రాయలసీమ ప్రోగ్రామ్ ఇన్చార్జి జే.ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి తద్వారా వారు ఆర్థికంగా ఎదిగి తమవంతు కుటుంబానికి ఆదరణగా నిలపాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తం గా సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలో చిత్తూరులో కూడా నిర్వహించామని, తిరుపతి నగరంలో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నా రు. ఐదు రోజుల పాటు మహిళలకు ఉచితంగా హస్తకళల తయారీ, టైలరింగ్, పెయింటింగ్ వంటి చేతివృత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శిక్షణలో పాల్గొనే మహిళలకు ఎలాంటి విద్యాప్రామాణికం లేదన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అంద జేయడంతో పాటు సాక్షి మైత్రీ మహిళలో సభ్యత్వం కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఆసక్తి గల మహిళలు 9505555020, 9640131153ను సంప్రదించాలని ఆయన కోరారు. అనంతరం ఎన్ఎఫ్ఐ సంస్థ డెరైక్టర్ మాదిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సాక్షి మైత్రీ మహిళ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పడిలైట్, ఉషా కంపెనీ ప్రతినిధు లు మహిళలకు హస్తకళలు, టైలరింగ్ వృత్తులపై శిక్షణ కల్పించారు.
చిత్తూరులో రెండోరోజూ ‘సాక్షి’ మైత్రీమహిళ
చిత్తూరు(సిటీ) : పిడిలైట్ సంస్థ, సాక్షి దినపత్రిక-టీవీ సంయుక్త ఆధ్వర్యంలో గృహిణుల కోసం నిర్వహిస్తున్న సాక్షి మైత్రీమహిళ కార్యక్రమం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. స్థానిక పీసీఆర్ ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు మహిళలు హాజరై పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఇతర హేండీక్రాఫ్ట్స్పై శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రో గ్రామ్ కో-ఆర్డినేటర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ గృిహ ణులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పా రు. మరో మూడు రోజుల పాటు చిత్తూరు నగరంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిడిలైట్ సంస్థకు చెందిన ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.
‘సాక్షి మైత్రీ మహిళ’కు విశేష ఆదరణ
Published Wed, Jun 25 2014 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
What’s your opinion
Advertisement